వాయు కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుండి వెలువడే పొగ.. పెట్రోల్ డీజిల్ వాహనాల వలన వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది.. వాయు కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ నగరాలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల్లో పాట్నా ఒకటి. బీహార్ రాజధాని పాట్నాలో 50 సిఎన్జి బస్సులు జనవరి నుంచి రోడెక్కనున్నాయి..
బీహార్ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కొత్త సిఎన్జి బస్సులు సమర్థవంతంగా పనిచేస్తాయని, అంతేకాకుండా వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, అందుకోసమే ఈ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం పాట్నా లో సుమారు 5,000 ఆటోలు నడుస్తుండడం గమనార్హం. కానీ సిఎన్జి కేంద్రాల కొరత ఎక్కువగా ఉంది. సిఎన్జి తక్షణమే అందుబాటులో ఉందని నిర్ధారించడానికి, 12 కొత్త సిఎన్జి కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీజిల్తో నడిచే కార్లను సిఎన్జి గా మార్చాలని ప్రతిపాదించింది.