షియోమీ నుంచి విడిపోయి సొంత కంపెనీగా ఏర్పడినప్పటి నుంచి పోకో పలు ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. పోకోకు చెందిన దాదాపు అన్ని ఫోన్లు ఇప్పటి వరకు కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అయితే వినియోగదారుల కోసం మరో నూతన స్మార్ట్ ఫోన్ను పోకో కంపెనీ విడుదల చేసింది. పోకో ఎక్స్ 3 పేరిట ఆ స్మార్ట్ ఫోన్ను ఆ కంపెనీ భారత్లో మంగళవారం విడుదల చేసింది. దీని ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం..!
పోకో ఎక్స్ 3 ఫోన్లో 6.67 ఇంచెస్ డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తోంది. స్నాప్డ్రాగన్ 732జి పవర్ఫుల్ ప్రాసెసర్ను ఇందులో అమర్చారు. 6, 8 జీబీ ర్యామ్, 64, 128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ను ఇచ్చారు. ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్లను ఇచ్చారు.
ఈ ఫోన్ లో వెనుక వైపు 64, 13, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు నాలుగు ఉన్నాయి. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపుకు ఉంటుంది. రెండు 4జి సిమ్లను వేసుకోవచ్చు. బ్లూటూత్ 5.0 ఫీచర్ ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్ట్ను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు.
* పోకో ఎక్స్ 3 స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999.
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,499.
* 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999.
ఈ నెల 29 నుంచి ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయవచ్చు.