ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్ మీ త్వరలో భారతీయ మార్కెట్లో రియల్ మీ ఎక్స్ 7 ప్రో ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో విడుదల కాగా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీనిపై ఎలాంటి ఆధికారిక ప్రకటన రాలేదు కానీ దీని విడుదలకు సంబందించిన ఒక వార్త ఆ కంపెనీ వెబ్ పేజీలో కనిపించింది. దీంతో ఈ ఫోన్ విడుదలపై అందరు అంచనాలను పెట్టుకున్నారు.
త్వరలో విడుదలవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఏఎంఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 91.6 శాతంగా ఉంది. ఐదవ జనరేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను కూడా ఇందులో అందించడం విశేషం. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీ 256 జీబీ వరకు ఉండనుంది. దీని స్టోరేజ్ సామర్థ్యం మైక్రో ఎస్డీ కార్డు ద్వారా కూడా పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉండగా, 65W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బరువు 184 గ్రాములుగా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లను కూడా ఇందులో పొందుపరచారు. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ డిసెంబర్ ముగిసేలోపు లేదా 2021 ప్రారంభంలో లాంచ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో దీని ధర 2,199 యువాన్ల(సుమారు రూ.23,500) నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా దీని ధర రూ.25 వేల లోపే ఉండే అవకాశం ఉంది.