శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో భిన్నమైన ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను తీర్చిదిద్ది వినియోగదారులకు అందిస్తుంటుంది. అందులో భాగంగానే శాంసంగ్ ఫోన్లు జనాలను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా శాంసంగ్ మరొక అద్భుతమైన ఫోన్ను గురువారం భారత్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం51 పేరిట ఆ ఫోన్ విడుదలైంది. ఇందులో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ. అవును.. ఏకంగా 7000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఈ ఫోన్లో శాంసంగ్ అందిస్తోంది. ఇదే దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఇక ఈ ఫోన్లో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. ఇది అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. అలాగే స్నాప్ డ్రాగన్ 730జి అధునాతన ప్రాసెసర్ను ఏర్పాటు చేసినందున ఫోన్ పనితనం బాగుంటుంది. ఈ ఫోన్లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ను అందించారు. 6, 8 జీబీ ర్యామ్ మోడల్స్లో విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్లు, ఒక మెమొరీ కార్డు వేసుకునేందుకు మొత్తం 3 స్లాట్లను ఇచ్చారు.
గెలాక్సీ ఎం51 ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. వెనుక వైపు 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 12, 5, 5 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్కు పక్క భాగంలో ఉంటుంది. అద్భుతమైన ఆడియో కోసం డాల్బీ అట్మోస్ ఫీచర్ను ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 5.0 ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా ఈ ఫోన్ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
* గెలాక్సీ ఎం51 ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999.
* 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999.
సెప్టెంబర్ 18 నుంచి అమెజాన్, శాంసంగ్ సైట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.