దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శ్యామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్న్యూస్ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్యామ్సంగ్ గాలెక్సీ నోట్ 20.. ఊహించిన దాని కంటే ముందుగానే మార్కెట్లోకి రాబోతున్నది. ఆగస్టు 5న దీనిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు శ్యామ్సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే రోజున శ్యామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 తో పాటు గెలాక్సీ ఫోల్డ్ 2, గెలాక్సీ వాచ్ 2ను కూడా ఆన్లైన్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
శ్యామ్సంగ్ గతంలో ఎలాంటి ఫోన్నూ ఆన్లైన్ ఈవెంట్లో విడుదల చేయలేదు. కోవిడ్-19 ప్రభావం కారణంగా తొలిసారిగా ఈ కొత్త మోడల్స్ను ఆన్లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనుంది. అయితే ఆగస్టు నాటికి కరోనా అదుపులోకి వస్తే ఈ విషయంలో ఆ సంస్థ మార్పులు చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు.
ఆగస్టు 5న మార్కెట్లోకి విడుదలయ్యే మోడల్స్లో నోట్ 20 అల్ట్రా, గాలక్సీ z ఫ్లిప్ 5 జీ, గాలక్సీ ట్యాప్ S7, గాలెక్సీ ట్యాప్ S7+ తదితర మోడల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలెక్సీ నోట్ 20, గెలాక్సీ ఫోల్డ్ 2 విడుదలకు సంబంధించి సంస్థ నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటి వరకు రాలేదు.