Facebook : ఫేస్బుక్ యూజర్లకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ సంఖ్యలలో ఫేస్బుక్ యూజర్లు ఉండగా వారిలో 500 మిలియన్ లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లను ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఈ విధంగా వినియోగదారుల ఫోన్ నెంబర్లు అమ్ముడు పోవడంతో సోషల్ మీడియాలో యూజర్ల భద్రత విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా మదర్బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యాయి. వీటిలో సుమారు ఆరు లక్షల మంది భారతీయులు ఫోన్ నెంబర్లు కూడా చోరీకి గురయ్యాయి.ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్ల విక్రయిస్తున్నట్టు మదర్బోర్డు రిపోర్ట్ చేసింది. ఒక ఫోన్ నెంబర్ విలువ దాదాపు 20 డాలర్లు చొప్పున అమ్ముడు పోయిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాలకు పైగా ఫేస్బుక్ వినియోగదారులు ఈ సమస్యకు ప్రభావితమయ్యారని ఈ సందర్భంగా తెలిపారు. బల్క్గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ ఈ విధంగా డేటా అక్రమాలకు పాల్పడటం పట్ల ఫేస్బుక్ యూజర్లకు తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విధంగా ఫేస్బుక్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నప్పటికి ఈ విషయం గురించి అటు ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు.