టెలికాం రంగంలో రేసు గుర్రంలా ముందుకు దూసుకుపోతున్న జియో సంస్థ మరో భారీ ప్రకటన చేసేసిందండోయ్.. దేశీయ పారిశ్రామిక రంగంలో రిలయన్స్ తన సత్తాను చాటుకుంటోంది. భారీ ఆఫర్లు చేస్తూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు చేరువవుతూనే ఉంది. రిలియన్స్ జియో తీసుకుంటున్న నిర్ణయాల మూలంగానే ఇతర నెట్ వర్క్ ను కాదనుకుని జియోను వాడేవారెందరో ఉన్నారు. సామాన్యులకు సైతం చేరువయ్యేలా ఎన్నో సేవలను ఇప్పటికే చాలానే అందించింది. రూ. 2500 లకే 5 జీ ఫోన్ ను వినియోగదారులకు అందించబోతున్నామని సంచలన నిర్ణయాన్ని ప్రకటించేసింది. మరి దాని సంగతేంటో చూసేదాం రండి..
భారీ నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులకు సైతం చేరువవుతున్న జియో మరో సంచలన నిర్ణయంతో వినియోగదారును, ప్రజలను సప్రైజ్ చేయడానికి సిద్ధమైంది. ఇండియాలో త్వరలనే 5 జీ నెట్ వర్క్ ప్రారంభంకాబోతోంది. మన దేశంలో ఇప్పటికే 5జీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి కూడా వచ్చాయి. అయితే ఈ 5జీ ఫోన్లు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వీటి ధర రూ. 27 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే సామాన్యులను ధృష్టిలో ఉంచుకుని రిలియన్స్ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే 5జీ ని అందించాలని తలచి 5జీ మొబైల్ ను త్వరలోనే లాంచ్ చేస్తామని జియో సంస్థ ప్రకటించింది.
అయితే వినియోగదారుల డిమాండ్ ను బట్టి జియో ఫోన్ల ధర రూ. 2500 నుంచి 3000 రూపాయల వరకు ఉండవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో 35 కోట్ల మంది ఇంకా 2 జీ మొబైల్స్ ను వాడుతున్నారు. వారిని ఆకర్షించడమే అతి తక్కువ ధరకే 5జీ మొబైల్స్ ను అందిస్తున్నారు కాబోలు. గూగుల్ తో కలిసి జియో ఈ మొబైల్ ను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే జియో తన ఖాతాలో చాలా మంది వినియోగదారులను చేర్చుకుంది. దీనితో తన లెక్క ఎంతకు పెరుగుతుందో చూడాలి మరి..