Vidya Sagar: పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి.. రోజు రోజుకి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.. పెట్రోల్ ధర సెంచరీ కొట్టిన ఆగకుండా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.107 కి చేరింది.. దీంతో పెట్రోల్ భారాన్ని మోయలేని తెలంగాణకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి ప్రత్యామ్నాయం కనుగొన్నారు..!! తన మోటార్ సైకిల్ కి పెట్రోల్ ఇంజిన్ తీసేసి బ్యాటరీ ని అనుసంధానం చేసి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు..!!
తెలంగాణ, జనగాం కి చెందిన కూరపాటి విద్యాసాగర్ పెట్రోల్ భారాన్ని మోయలేక ప్రత్యామ్నాయం కనుగొన్నారు. తన దగ్గర ఉన్న ద్విచక్ర వాహనానికి బ్యాటరీని అమర్చారు. ఇందుకోసం 7500 రూపాయలను ఖర్చు చేసి 30AH బ్యాటరీని తన బైకు అనుసంధానం చేశారు.. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బ్యాటరీ ని చార్జింగ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఒక యూనిట్ ఖర్చవుతుందని తెలిపారు. గతంలో ఒక రోజుకు రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అవతుందని ఇప్పుడు 10 రూపాయలతో సరిపోతుందని విద్యాసాగర్ వివరించారు. బ్యాటరీని అమర్చడంతో డబ్బు ఆదా చేసుకోవడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని తెలిపారు.