అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకెర్ బర్గ్ అటు వాట్సాప్ తో పాటు ప్రపంచ జనాభా అత్యధికంగా వాడే ఇన్స్టాగ్రామ్ కూడా తన సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతని ఆధీనంలో ఉండే మూడు యాప్స్ కాకుండా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న యాప్ టిక్ టాక్. ఇకపోతే వీడియో యాప్స్ లో ఎప్పటికీ అగ్రగామిగా వెలుగొందే యూట్యూబ్ మాత్రం ప్రపంచ నెంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ వారికి చెందినది.
అయితే ఇప్పుడు భయంకరమైన ట్రెండ్ లో ఉన్న టిక్ టాక్ కు పోటీగా యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ ను లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ట్రయల్ కోసం 15 సెకన్ల నిడివి గల వీడియో ఆప్షన్ ను విడుదల చేసింది. ఇకపోతే టిక్ టాక్ లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన 15 సెకండ్ల వీడియో ఆప్షన్ ను ఇతర సోషల్ మీడియా యాప్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి.
టిక్ టాక్ లాగానే వీడియో మ్యూజిక్ రీమిక్స్ ఆప్షన్లను ప్రవేశపెట్టాయి. అయితే ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఈ ఆప్షన్ కొన్ని దేశాల వినియోగదారులకు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే ఈ వీడియోలు కి ‘షార్ట్స్’ అని పేరు పెట్టిన వారు ఈ ఆప్షన్ ను అన్ని దేశాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
దానిని తమ యాప్ లో పొందు పరచాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది. సంబంధించిన ప్రయోగాలు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎప్పుడో మొదలు పెట్టేశారు. అయితే కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
మీరు కూడా ఈ ప్రయోగం లో భాగమవ్వాలని అనుకుంటే మీ యూట్యూబ్ మొబైల్ అప్ లో పరిశీలించు కోవచ్చు,అందులో create వీడియో ఆప్షన్ ను చూసి టెస్ట్ చేయండి.ఇది ఎలా పని చేస్తుందంటే మీ ఫోన్ అప్ లోని రికార్డింగ్ బటన్ ను క్లిక్ చేసి అలానే ఉంచి వీడియో పూర్తి అయినా తరవాత మళ్ళీ క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది.ఇలాగే 15 సెకండ్లు వీడియో పూర్తి అయ్యేంతవరకు రికార్డు చెయ్యవచ్చు. అంతే..!