సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 41 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. కళాశాల సైన్స్ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్ధులు స్పృహ తప్పి పడిపోయారని వాదన వినబడుతుండగా, యాజమాన్యం మాత్రం ప్రయోగశాలే తెరవలేదని చెబుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్ధులను అంబులెన్స్ లో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో 33 మంది విద్యార్ధులు కోలుకోగా ఎనిమిది మందికి ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రేపటి వరకూ అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాల గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ల్యాబ్ లో అక్విప్ మెంట్ పగలడం వల్ల గ్యాస్ లీక్ అయి పస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కు వ్యాపించడం వల్ల విద్యార్ధినులు అస్వస్థతకు గురైనట్లు ఏబీవీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం మీద నమ్మకం లేక విద్యార్ధుల పేరెంట్స్ వచ్చి తమ పిల్లలను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించుకుంటున్నారని విద్యార్ధి సంఘ నేతలు అంటున్నారు. ఈ ఘటనతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు. విద్యార్ధినులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు.
Nearly 30 students of Kasturba Gandhi Junior College for Women, Secunderabad, have fell sick after inhaling the #ToxicGas while holding an experiment in the science laboratory, #Students suffered respiratory problems, immediately taken to a nearby hospital.#Hyderabad #Gasleak pic.twitter.com/5kYC1EUD0n
— Surya Reddy (@jsuryareddy) November 18, 2022