బాసర ట్రిపుల్ ఐటి మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తమ సమస్యల పరిష్కారానికై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోజుల తరబడి ఆందోళన చేసి తమ డిమాండ్ లను కొంత మేర పరిష్కరించుకున్న సంగతి తెలిసిందే. బాసర ట్రిపుల్ ఐటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఇప్పుడు తాజాగా కలుషిత ఆహారం కారణంగా 60 మందికి పైగా విద్యార్ధులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తొంది. కుళ్లిన చికెన్, గుడ్డుతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్ కారణంగా వందలాది మంది విద్యార్ధులు అస్వస్థతకు గురైనట్లు నాగేశ్వరరావు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు ట్రిపుల్ ఐటిలో పరిస్థితి వివరించేలా ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ కమిటి (టీ పీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బాసర త్రిపుల్ ఐటీ మెస్ లో కలుషిత ఆహారం కారణంగా 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమ పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో విద్యార్ధులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బాసర త్రిపుల్ ఐటీ మెస్ లో కలుషిత ఆహారం కారణంగా 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దిగ్భ్రాంతి కలిగించింది.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.#IIITBasar pic.twitter.com/Mjuefts6D2
— Revanth Reddy (@revanth_anumula) July 15, 2022