అస్సాం సీఎం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వేడుకల నేపథ్యంలో ఎంజే మార్కెట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పాల్గొనటానికి బీజేపీ నాయకుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నందు బిల్లాల్ అనే కార్యకర్త.. అస్సాం సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
దీంతో అప్రమత్తమైనా ఉత్సవ కమిటీ వెంటనే అతడిని హైదరాబాద్ పోలీసులకి అప్పగించడం జరిగింది. ముందుగా చార్మినార్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన హిమంత బిశ్వ శర్మ.. అనంతరం మోసం జాహీ మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై ప్రసంగించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హిమంత విమర్శలు చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా శర్మ వెనుక నుండి వచ్చిన నందు బిలాల్.. మైక్ లాక్కుని.. అస్సా ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగారు.
Tamilnadu : సీఎం పలనిస్వామి సూపర్ రాజకీయం..! పీకేకి కూడా లేని ఐడియాలతో స్టాలిన్ కి వణుకు..!!
ఈ పరిణామంతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంకా పోలీసుల వెంటనే నందు బిలాల్ నీ అక్కడ నుంచి కిందకి తరలించారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. కేంద్రంలో మరో 30 సంవత్సరాలు పాటు బీజేపీ యే అధికారంలోకి ఉంటుందని అన్నారు. విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల నెరవేరదని పేర్కొన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ఆయన ఎక్కడ తిరిగిన గౌరవం లభించదని కీలక వ్యాఖ్యలు చేశారు.