Amit Shah: బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ (Hyderabad)లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కనీసం పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుపుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ (Congress) ఉందంటూ వ్యంగ్యంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ తమ సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని అన్నారు షా.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Read More: GHMC: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. రూ.20లక్షలు జరిమానా
కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ఓడిపోతామన్న భయంతోనే ఆ కుటుంబం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదని అమిత్ షా విమర్శించారు. కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు వెన్నెముక లేని రాజకీయాల వంటివి దేశానికి పట్టిన దరిద్రాలు అని అన్నారు. ఏళ్ల తరబడి దుస్థితికి ఇవే కారణమని అన్న అమిత్ షా .. వచ్చే 30 – 40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాలకు దారి చూపే విశ్వ గురువుగా భారత్ ఎదుగుతుందని అన్నారు అమిత్ షా.
Read More: Bandi Sanjay: సీఎం కేసిఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా నేతలు ఫైర్
సమావేశాల్లో అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక, అసొం సీఎంలు తీర్మానాన్ని బలపరిచారు. ఈ సందర్భంలో గుజరాత్ అల్లర్లలో మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలని తీర్మానం చేశారు.