ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీఎస్ సెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. వరంగల్లు కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ రమేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 61,613 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోని 272 కళాశాలల్లోని 27,017 సీట్ల భర్తీకి ఈ పరీక్ష ను నిర్వహించారు. టీఎస్ ఐసెట్ ఫలితాల్లోనూ ఏపి విద్యార్ధులే టాప్ 3 ర్యాంకులను సాధించారు.
ఇటీవల తెలంగాణ సర్కార్ నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో ఏపి విద్యార్ధులు టాపర్లుగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ పరీక్షల్లోనూ అదే ఒవరడి కనపించింది. ఏపిలోని గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్ధన్ ఐసెట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, కడప జిల్లాకు చెందిన ఉమేశ్ చంద్రారెడ్డి ద్వితీయ ర్యాంక్ సాధించారు. గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన కాట్రగడ్డ జితిన్ సాయి మూడో ర్యాంక్ చేజిక్కించుకున్నాడు. కాగా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాల్గవ ర్యాంక్ సాధించారు.
జూలై 28న తెలంగాణలో పది, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ సారి 68,781 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా, 61,781 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని వీసీ రమేశ్ తెలిపారు. ఫలితాలు HTTPS://icet. tsche.ac.in లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.