MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్ధిగా మీర్జా రెహమత్ బేగ్ కు ఎంఐఎం అవకాశం ఇచ్చింది. మీర్జా రెహమత్ బేగ్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీకి .. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంత కాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ .. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓవైసీ ట్వీట్ చేశారు. ఎంఐఎం అభ్యర్ధిగా ఎంపికైన రహమత్ బేగ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా ఎంఐఎం 52, బీఆర్ఎస్ 41, బీజేపీ 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తేనే గెలుపు అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఓట్ల లెక్క చూసుకుంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఇప్పటి వరకూ ఎన్నికకు దూరంగా ఉండాలని భావించిన బీజేపీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీపై పునరాలోచన చేస్తున్నది. బీజేపీ గనుక బరిలో దిగితే ఓటింగ్ తప్పనిసరి కానున్నది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై ఇప్పటికే బీజేపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఎల్లుండితో నామినేషన్ ఘట్టం ముగియనున్నది. ఇదిలా ఉండగా, మరో వైపు హైదరాబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్ధిగా ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
AP Political Survey: ఏపిలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు..??