ATM Cash Robbery Case: కూకట్ పల్లిలోని హెచ్ డీ ఎఫ్ సీ ఏటిఎం వద్ద సినీ పక్కీలో కాల్పులు జరిపి దుండగులు నగదు దోచుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అయి ఉంటారు ? ఎంత నగదు దోచుకువెళ్లారు ? దుండగులను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఘటన గురించి తెలియగానే ఆయన అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులపనేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో ఒక గన్ కాట్రిడ్జ్ తో పాటు హెల్మెట్ స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు.
దోపిడీకి దుండగులు కంట్రీ మేడ్ రివాల్వర్ ఉపయోగించారని దానికి సంబంధించి ఒక మ్యాగజైన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాల్పులు జరిపిన తీరు చూస్తే వారు పక్కా ప్రొఫెషనల్స్ అని అర్థమవుతోందనీ, కశ్చితంగా బయటి గ్యాంగ్ పనేనని ఆయన పేర్కొన్నారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన ఆలీ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారనీ, మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారన్నారు. నిందితులు రూ.5లక్షలు దోచుకువెళ్లినట్లు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ ఘతకానికి పాల్పడి పారిపోయిన వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఇప్పటికే గాలింపు చర్యలను ముమ్మరం చేశామనీ, గాలింపు చర్యల కోసం ఆరు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?