Bandi Sanjay :తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వర్సెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేసీఆర్ నేరుగా బండి సంజయ్ పై విమర్శలు గుప్పించకపోయినా ఆయన టీం మాత్రం ఏ మాత్రం చాన్స్ దొరికినా బండి సంజయ్ పై విరుచుకుపడుతుంది. తాజాగా అదే జరిగింది.
Bandi Sanjay బండి సంజయ్ ఏమన్నారంటే…
కాంగ్రెస్ నేత బీజేపీలో చేరిన సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్ ఈ సందర్భంగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దుబ్బాకలో బిజెపి కొట్టిన దెబ్బకు కేసీఆర్ గూబ గుయ్యిమన్నదన్న ఆయన తెలంగాణలో తెరాస గడీల పాలన, రాక్షస పాలన అంతమొందించాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి.. కేసీఆర్ బాక్సులు బద్ధలవుతున్నాయని ఆయన అన్నారు.
ప్రజల పోరాటం ఫలితంగా సిర్పూర్ మిల్లు ప్రారంభించారు.. కానీ స్థానికులకు ఉద్యోగాలు రాలేదు…80 శాతం ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. న్యాయవాది వామన రావ్ దంపతుల జంట హత్యల కేసులో ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయం..వెంటనే సీఎం స్పందించాలని అన్నారు.బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ రాబోవు రెండు సంవత్సరాలు కష్టపడండి… మీ కోసం మేము కాపలాగా ఉంటామని అన్నారు.
35 వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెడితే లక్షకోట్లతో దోచుకునే ప్రాజెక్టు గా మార్చిండు. కమిషన్ ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్ట్ ల పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కడతామని ఓ తట్ట మట్టి కూడా తీయలేదన్న ఆయన గిరిజనుల కోసం పోరాడి ప్రశ్నిస్టెంమా పై దాడి చేసి, అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని అన్నారు.
కేసీఆర్ టీం తక్కువ తినలేదు….
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ ఆధారాలతో మాట్లాడాలని…సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రాంతంలో బిజెపి నేతలు దుర్మార్గపు మాటలు మాట్లాడారని.. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే అతిగతి లేదని ఫైర్ అయ్యారు.
కేంద్రం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు ఇప్పించలేని బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్రం చేతుల్లో ఉన్న పని చేయకుండా..ఏదో చేస్తామని బిజెపి నేతలు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి వ్యవహారాలపై సీబీఐ కాదు…సీబీఐ అయ్యా…సీబీఐ తాత ఎంక్వరీ చేసినా ఏం జరుగదన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?