తన ఫోన్ మిస్ అయ్యిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజ్ కేసులో ప్రధమ నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ నివాసం నుండి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్న సమయంలో తన ఫోన్ మిస్ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు బండి సంజయ్. అరెస్టు చేసే క్రమంలో పడిపోయిందనీ, ఫోన్ లో చాలా కీలక సమాచారం ఉందని అంటున్నారు. అయితే తమ దగ్గర ఫోన్ లేదని పోలీసులు చెబుతున్నారు. మరో పక్క బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ పై రాజకీయ విమర్శలు రాజుకుంటున్నాయి. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందనేది మిస్టరీ గా మారింది. విచారణ కోసం అడిగితే బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ అంశం పై ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తొంది.
టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో బండి సంజయ్ ను మంగళవారం రాత్రి పోలీసులు కరీంనగర్ లో అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి బొమ్మలరామారం పీఎస్ కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మద్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడి నుండి ఆయనను యాదగిరిగుట్టకు తరలించారు. మార్గమధ్యలో ఆయన ను ఎక్కించిన పోలీసు వాహనం మొరాయించడంతో మరో వాహనం ఎక్కించి బొమ్మలరామారం పీఎస్ కు తరలించారు పోలీసులు. చివరకు ఈ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు మరుసటి రోజు బెయిల్ మంజూరు చేయడంతో కరీంనగర్ జైలు నుండి శుక్రవారం విడుదల అయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?