Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై , ఆయన పార్టీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంటారు. అయితే తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ కి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఊహించని షాక్ తగలింది. బండి సంజయ్ 600 కోట్లు సంపాదించినట్టుగా సోషల్ మీడియా లో వైరల్ అయింది. దీనిపై సంజయ్ ఘాటుగా స్పందించారు.
Bandi Sanjay : ఫాల్త్ గాళ్లు ప్రచారం…. సంచలన ప్రకటన
తాను 600 కోట్లు సంపాదించినట్టు ఫాల్త్ గాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఒకవేళ ఈ ఆస్తులు నిరూపిస్తే నిరుద్యోగ భృతి తానే ఇస్తానని సంచలన ప్రకటనల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి అని చెప్పారే తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేయడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. అందుకే ప్రకటనలతో సరిపెట్టారే తప్పించి అమలు చేయలేదని ఆరోపించారు.
బండి సంజయ్ ను టార్గెట్ చేసిన వారికి షాక్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కు భారీ ఆస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం కావడంపై బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సంజయ్కు రూ.600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐపీ అడ్రెస్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ను టార్గెట్ చేసిన వారి గురించి పోలీసులు గుట్టు బయట పెట్టనున్నారని చెప్తున్నారు.