హనుమకొండలోని బీసీ బాలికల వసతి గృహంలో అయిదుగురు విద్యార్ధులు శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆరేపల్లిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధినుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో స్పూర్తి, జ్యోత్స్న, రిత్విక, దేవి, చార్మిక అనే బాలికలు శానిటైజర్ త్రాగినట్లు సమాచారం.
విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి వారిని వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం ..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు