Big Breaking: పాసింజర్ ట్రైన్ లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలాన్ని రేపింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్ వెళుతుండగా ప్యాసింజర్ ట్రైన్ లో మంటలు ఏగిసిపడ్డాయి. అప్రమత్తమైన లోకోపైలెట్ ట్రైన్ నిలుపుదల చేశారు. ప్రయాణీకులు భయంతో ట్రైన్ దిగి పరుగులు తీశారు. సాంకేతిక లోపం కారణంగానే పొగలు వచ్చాయని భావిస్తున్నారు. లోకో పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
రైల్వే శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడంతో ప్రయాణీకులకు ఎటువంటి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.