Big Breaking: తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అదికారులు అందించిన నివేదికను పరిగణలోకి తీసుకున్న కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ తదితరుల అంశాలపై సమీక్ష జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది.
లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులకు కేబినెట్ ఆదేశించింది. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా విద్యాసంస్థలు, ధియేటర్లు తెరిచే విషయంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయం శనివారం నుండే అమల్లోకి రానుంది. లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేసిన తరువాత తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నది. గ్రామాల్లో పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు.
లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2021