Big Breaking: హైదరాబాద్ శంషాబాద్ లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వేగంగా వేగంగా వెళుతూ కారును ఢీకొట్టి బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ మార్కెట్ నుండి వ్యాపారులు కూరగాయలు తీసుకువెళుతుంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో దాదాపు 30 మంది ఉన్నారు. ఆరుగురు వ్యాపారులు లారీ కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తుండగా వారిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.