Big Breaking : హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి రెండో ప్రాధాన్యత ఓటు తో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి రామచంద్ర రావు పై ఆమె గెలుపొందారు. ఆమె గెలుపును మరికొద్ది సేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. వాణి దేవి కి1,49,269 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి రామచంద్రరావుకు లక్ష 1,37,556 ఓట్లు వచ్చాయి.11,703 ఓట్ల ఆధిక్యతతో వాణి దేవి గెలిచారు.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వేసిన వ్యూహం ఫలించింది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపి ప్రత్యర్థులు ఊహించని విజయం సాధించారు. మరోపక్క వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ స్థానం లో టిఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కెసిఆర్ వ్యూహాత్మక అడుగుతో హైదరాబాద్ సెట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపి కోల్పోయింది. వాణి దేవి విజయంతో తెలంగాణ భవన్ వద్ద బీజేపీ నేతలు బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు. అయితే సంబరాలు అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాల్పుల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే మంటలను అదుపు చేశారు.