BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దుబ్బాక (Dubbaka) ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 40కిపైగా స్థానాలు కైవశం చేసుకోవడం, ఆ తరువాత హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు తరచు కార్యక్రమాలకు వస్తూ కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ వేదికగా జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ఇలా పార్టీ అగ్రనేతలు అందరూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హజరు అవుతున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ తరుణంలో జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక్క రోజు ముందు ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్ లతో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ లు బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. హస్తినాపురం కార్పోరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పోరేటర్ పొడుపు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పోరేటర్ దేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పోరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపి ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ అసిఫ్ లు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ సమంక్షంలో వీరు పార్టీలో చేరి గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ కార్పోరేటర్ లతో ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న తరుణంలో నలుగురు కార్పోరేట్ లు పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరడం విశేషం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?