BJP : తెలంగాణ telangana లో ఎంతో బలంగా ఉన్న టీఆర్ఎస్ TRS ను బీజెపీ BJP ఎదుర్కొని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో మోడీ modi బండి సంజయ్ bandi sanjay కు పార్టీ పగ్గాలు అప్పగించారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి సీఎం కేసిఆర్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. బీజెపీ దెబ్బకు కొంది మంత్రులు కూడా సీఎం కేసిఆర్ ను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
బండి సంజయ్ వ్యూహాత్మక అడుగులు
బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కొంత మంది మంత్రులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్లుకు చెందిన ఓ మంత్రి సాగించిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఓ నివేదిక కూడా సిద్దం చేశారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఆధారాలతో హైకోర్టులో వేసి సీబీఐ విచారణ కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రులను లక్ష్యంగా పావులు కదిపితే వారు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పలువురు మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు లాగేందుకు బండి సంజయ్ చాణిక్యతను ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. బండి సంజయ్ దూకుడు మనస్థత్వం కారణంగా దుబ్బాక ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, జీహెచ్ఎంసి ఎన్నికల్లో అనూహ్యంగా స్థానాలు కైవశం చేసుకోవడంతో బీజేపీ మంచి ఊపులో ఉంది. ఈ ఊపును కొనసాగిస్తూ అధికార టీఆర్ఎస్ ను ఇబ్బందులు పెట్టాలని బంజయ్ సంజయ్ ఎత్తుగడ అని అంటున్నారు. బండి సంజయ్ తీవ్రస్థాయిలో కేసిఆర్ ను విమర్శలు చేస్తున్నా టీఆర్ఎస్ శ్రేణులను గట్టిగా రియాక్షన్ రాకపోవడానికి కారణం కేంద్రంలో బీజెపీ అధికారంలో ఉండటం, కొందరి నేతల చిట్టా బండి సంజయ్ వద్ద ఉండటమే కారణనే వార్తలు వినబడుతున్నాయి.