Breaking: కర్ణాటకల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి రెండు కుటుంబాలకు చెందిన 32 మంది అరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుతుని గోవా విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో గోవా నుండి హైదరాబాద్ కు వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపుర గ్రామం వద్ద ఓ మినీలారిని ఢీకొట్టిన ఈ బస్సు అదుపుతప్పి కల్వర్టులో పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సుకు అంతటికీ వ్యాపించడంతో పలువురు ప్రయాణీకులు మంటల్లో చిక్కుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురు ప్రయాణీకులను రక్షించారు. బస్సు ఆద్దాలను పగులగొట్టి వారిని కాపాడారు. ఈ లోపే మంటలు విస్తరించడంతో బస్సులోని ముగ్గురు ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కలబురిగి జిల్లా ఆసుపత్రితో పాటు యూనైటెడ్, గంగా ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో అర్జున్ కుమార్ (37) సరళాదేవి (30), బీవన్ (4), దీక్షిత్ (9), రవళి రవళి (30), అనితారాజు (40), శివకుమార్ (35) చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు.