Breaking: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317 జివోను సవరించాలని బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టగా ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటించలేదనీ, పోలీస్ అనుమతి లేకుండా ఆందోళన చేశారనీ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని తదితర అభియోగాలపై బండి సంజయ్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఉదయం పోలీసులు బండి సంజయ్ ను కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదే సందర్భంగా బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించడంతో పోలీసులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ అరెస్టు సందర్భంలో ఆదివారం రాత్రి కరీంనగర్ లోని ఆయన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది.
Breaking: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
మరో పక్క బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సహా రాష్ట్ర నేతలు తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ పై తెలంగాణలో కేసిఆర్ సర్కార్ దాడి, అరెస్టు, బీజేపి కార్యకర్తలపై లాఠీ చార్జి అమానుషమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ట్వీట్ చేశారు. ఇది ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమేననీ, ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జేపి నడ్డా పేర్కొన్నారు. పోలీసుల ప్రవర్తించిన తీరుకు సంబందించి ఓ వీడియోను నడ్డా ట్యాగ్ చేశారు.
నిన్న రాత్రి @BJP4Telangana అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp పై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దాడి, అరెస్టు, బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం.. తీవ్ర విచారకరం.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/n07yp0FH8i
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022