Breaking: మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నీనా అనే రీతిలో ప్రచారం చేస్తూ క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాాలు చేస్తున్నాయి. భారీగా నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఒక పార్టీపై మరోక పార్టీ ఆరోపణలు చేసుకుంటోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ప్రవేశించే అన్ని వాహనాలను పోలీస్, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ గా నగదు పట్టుబడుతుండటంతో వాటిపై ఐటీ ఆరా తీస్తొంది. ఈ తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారిపై తనిఖీలకు కేంద్ర బలగాలను పంపింది. పంతంగి టోల్ ప్లాజాను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకుని ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. ఉప ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ భారీ గా నగదు రవాణా, పంపిణీ పెరిగే అంచనా వేస్తున్న అధికారులు మరిన్ని బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడుతున్న నగదుపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పది లక్షలకు పైగా మొత్తం పట్టుబడితే ఆ కేసులను నగదుతో పాటు ఆదాయపన్ను శాఖకు బదిలీ చేస్తున్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా దొరికిన సొమ్ముపై ఐటీ అధికారులు ఆరా తీస్తొంది. కేసులో ఉన్న వ్యక్తుల ఆర్ధిక స్తోమత, వారు చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేదా అని విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వాటికి సంబంధించిన ఆధారాలను పరిశీలన చేస్తున్నారు. చాలా వరకు నిందితులు మాత్రం భూమిగా అమ్మగా వచ్చిన డబ్బు అనో లేక ఇళ్లు విక్రయించిగా వచ్చిన సొమ్ము అనో, వ్యాపారానికి సంబంధించిన నగదు అనో చెబుతున్నట్లుగా సమాచారం. ఈ విషయాలను పరిశీలించేందుకు హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో డీడీగా పని చేస్తున్న ఓ అధికారిని నోడల్ అధికారిగా నియమించారు. ఆయన పర్యవేక్షణలోనే పట్టుబడిన నగదుపై విచారణ జరుగుతుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర పరిధిలోని పోలీస్, రెవెన్యూ అధికారులే వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగి వాహనాల తనిఖీ చేస్తుండటం విశేషం.
Munugode Bypoll: మునుగోడులో భారీగా నగదు పట్టివేత