Breaking: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో ఆర్ టీసీ బస్సు – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. స్థానికులు క్షతగాత్రుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుండి కామారెడ్డి వైపు టీఎస్ ఆర్టీసీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.