Breaking: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ద్వితీయ ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నేడు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలను రద్దు చేసిన కేసిఆర్ సర్కార్ తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది.
ఇంటర్ పరీక్షలపై మంగళవారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. కేబినెట్ మీటింగ్ తరువాత పరీక్షలపై ఎటువంటి ప్రకటన చేయని ప్రభుత్వం నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇంటర్, టెన్త్ పరీక్షలను రద్దు చేశాయి. కాగా ఏపి ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించింది. ప్రస్తుతానికి పరీక్షలను వాయిదా వేసింది. వచ్చె నెలలో కరోనా పరిస్థితులపై సమీక్షించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?