Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో (మొయినాబాద్ ఫామ్ హౌస్) సైబరాబాద్ పోలీసులుకు హైకోర్టులో ఊరట లభించింది. తొలుత ఏసీబీ కోర్ట్ తీర్పు ను హైకోర్టు సమర్థించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బేరసారాలు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రామచంద్ర భారతి స్వామీజీ అలియాస్ము సతీష్ శర్మ, నందకుమార్, సింహాయాజీ లను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు హజరుపర్చగా గురువారం రాత్రి మెజిస్ట్రేట్ నిబంధనలు పాటించలేదన్న కారణంతో వారి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. 41 ఏ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
దీంతో మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై సైబరాబాద్ పోలీసులు నిన్న హైకోర్టులో నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల తరపు ప్రభుత్వ న్యాయవాది నిన్న హైకోర్టు ఇచ్చిన మథ్యంతర ఉత్తర్వులను నిందితులు ఉల్లంఘించారని తెలిపారు. నిన్న సాయంత్రంలోపు నిందితులు తమ నివాస చిరునామాలను పోలీసులకు అందించడంలో విఫలమైయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిందితుల రిమాండ్ కు అనుమతించింది. నిందితులు 24 గంటల్లో సైబరాబాద్ పోలీసుల ముందు హజరు కావాలని ఆదేశించింది. ఏసీబీ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. కోర్టు తీర్పుతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు పోలీసుల ముందు హజరై విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.