Breaking: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం రాజకీయంగా సంచలన వార్తే. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అవమానించే రీతిలో తీవ్ర కామెంట్స్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసోం సీఎం వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ అసొం సీఎం హిమంత బిశ్వశర్మ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసిఆర్ సైతం తీవ్రంగా ఖండించారు.
Breaking: అసొం సీఎంపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
ఇటీవల తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిశ్వశర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అదే క్రమంలో రెండు రోజుల క్రితం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు. రాహుల్ గాంధీ పై అసొం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ ఫిర్యాదు మేరకు అసొం సీఎం బిశ్వశర్మపై ఐపీసీ 504,505 క్లాజ్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More:YS Jagan: సినీ నటుడు ఆలీకి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!ఇదిగో ప్రూఫ్..!!