దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ అధినేత కేసిఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ జండాను ఆవిష్కరించిన కేసిఆర్ .. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామల, నవ చండీ యాగాలను నిర్వహించారు. కేసిఆర్ దంపతులు ఈ యాగాల్లో పీటలపై కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
కాగా బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమార స్వామిలతో పాటు వివిధ పార్టీల ఎంపీలు, ఇతర నాయకులు హజరై కేసిఆర్ కు అభినందనలు తెలియజేశారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరించే కార్యక్రమంలో భాగంగా ముందుగా వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనుంది అక్కడి జెడిఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్లు ఇప్పటికే కేసిఆర్ వెల్లడించారు.
అయితే కేసిఆర్ తనయుడు మంత్రి కేటిఆర్ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరు కాలేదు. ఈ ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మంత్రి కేటిఆర్.. హైదరాబాద్ లో ముందుగా ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఉండటంతో గైర్హజరు అయ్యారు. ఈ విషయాన్ని సీఎం కేసిఆర్ కు తెలియజేసి అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
BRS Party Chief and CM Sri KCR inaugurates BRS (Bharat Rashtra Samithi) office in Delhi. Samajwadi Party Chief Sri @yadavakhilesh, JD(S) Leader Sri @hd_kumaraswamy, VCK MP Sri @thirumaofficial and others took part in the inauguration ceremony. pic.twitter.com/dDyMiwRphI
— TRS Party (@trspartyonline) December 14, 2022