సికింద్రాబాద్ కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) మృతిపై తెలంగాణ సీఎం కేసిఆర్ సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నెల 16న గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవేళ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రికి ఆయన ఇంటికి తరలించారు.
బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన సాయన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కంట్రోన్మెంట్ నియోజకవర్గం నుండి సాయన్న అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 1994, 1999, 2004, 2014 లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. హుడా డైరెక్టర్ గా ఆరు సార్లు బాధ్యతలు నిర్వహించారు. 2015 లో టీటీడీ పాలకమండలి సభ్యుడుగా బాధ్యతలు సేవలు అందించారు. వీధి బాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. అయిదు సార్లు ఎమ్మెల్యగా గెలిచి అరుదైన ఘనత సాధించారని కేసిఆర్ అన్నారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవ చిరస్మరణీయం అని కొనియాడారు. సాయన్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం కేసిఆర్ ఓదార్చారు. సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, మల్లారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నీచ రాజకీయాలు అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్