CBI : ఢిల్లీలో ఓ టీఆర్ఎస్ ఎంపి నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఎంపి సహాయకులమంటూ చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి వద్ద నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్ లు నిందితులుగా గుర్తించారు.
సీబీఐ అధికారుల దాడి సమయంలో సదరు ఎంపి ఇంట్లో లేరని సమాచారం. ఒ ఇంటి యజమాని అక్రమ నిర్మాణానికి సంబంధించి రూ.5లక్షల లంచం డిమాండ్ చేయగా గురువారం సదరు వ్యక్తి లక్ష రూపాయలు ఇస్తుండగా అధికారులు పై ముగ్గురుని పట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడు మన్ మీత్ సింగ్ లంబా ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఈ దాడి చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ సాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?