హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతొన్న ప్రతిష్టాత్మక ఫార్ములా – ఈ రేసింగ్ లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హజరయ్యారు. గ్యాలరీ నుండి తమ ఫేవరేట్ జట్టు అయన భారత్ కు చెందిన మహీంద్ర కు సపోర్టు చేశారు. సినీనటుడు నాగార్జున, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, నవదీప్, సిద్దు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ ఆశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేసింగ్ ను వీక్షించారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా – ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది.
ప్రధాన రేస్ కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యిమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్ లో 11 ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఫార్ములా – ఈ లో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తొంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్ లు పూర్తి అయ్యాయి. మెక్సికో సిటీలో మొదటి రేసుకు అతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేసులు జరిగాయి. భారత దేశంలో ఇలాంటి రేసులు రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్తు లో ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్ లు భారత్ లోనూ.. అందులోనూ హైదరాబాద్ లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏపికి చెందిన ఎంపీలు సీఎం రమేష్, కే రామ్మెహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఫార్ములా రేస్ ను వీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా – ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకువెళుతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు.
Delhi Liquor Scam Case: మాగుంట రాఘవరెడ్డి పది రోజుల ఈడీ కస్టడీ
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?