Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో పది మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించారు. ఈ ప్రమాదంపై మోడీ, కేసిఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే విధంగా అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల వంతున ఆర్ధిక సాయం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించినట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు.
Breaking: సికింద్రాబాద్ బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రూబీ లాడ్జి భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా లాడ్జీలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన వారు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటన ప్రదేశంలోనే ముగ్గురు మృతి చెందగా, నలుగురు సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సికింద్రాబాద్ బైక్ షో రూమ్ అగ్నిప్రమాదంలో 8 మంది మృతి