క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ ఇవేళ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ అయ్యారు. రాజాసింగ్ నివాసానికి వెళ్లి చీకోటి ప్రవీణ్ కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాజాసింగ్ తో బేటీ అనంతరం చీకోటి ప్రవీణ్ ను మీడియా ప్రశ్నించగా తమ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. పీడీ యాక్ట్ కేసులో 70 రోజులకుపైగా చర్లపల్లి జైలులో ఉండి వచ్చిన నేపథ్యంలో ఓ హిందూ వాదిగా రాజాసింగ్ ను కలిసి పరామర్శించినట్లు చెప్పుకొచ్చారు. హింధూ ధర్మం కోసం పోరాడే వారికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తోనూ గతంలో పరిచయం ఉందని కానీ దాదాపు పదేళ్ల నుండి కలవలేదని చెప్పారు
Breaking: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్
ఈడీ కేసుల కారణంగానే బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కలుస్తున్నాను అన్న మాటలను కొట్టిపారేశారు. తనకు ఆ అవసరం లేదని పేర్కొన్నారు. ఈడీ అదికారులు అడిగిన సమాచారం మొత్తం ఇచ్చాననీ, తాను అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. బలవంతపు మత మార్పిడిలను నిరోధించాలన్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసిన విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా, తనకు సంబంధించిన కొన్ని విషయాలను అడిగితే చెప్పాననీ, సినిమా తీస్తారేమో తెలియదన్నారు. ఒక వేళ మువీలో రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇస్తే నటిస్తానని చెప్పుకొచ్చారు. చీకోటిీ ప్రవీణ్ కు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. .