CM KCR: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయం సాధించి..తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఈషా సింగ్ లకు కేసిఆర్ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. ఇద్దరికీ రెండు కోట్ల రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. టర్కీలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకాన్ని సాధించారు. జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో ఈషాసింగ్ స్వర్ణపతకం సాధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM KCR: రెండు కోట్ల నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం
గొప్ప విజయాలను సాదించిన ఈ తెలంగాణ బిడ్డలకు సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు. ఒక్కొక్కరికి రెండు కోట్ల నగదు బహుమతి ఇవ్వాలన్న సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రేపు చెక్కులు అందజేత
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జూన్ 2 (గురువారం) ఇద్దరికీ ముఖ్యమంత్రి కేసిఆర్ నగదు బహుమతి చెక్కులను అందించనున్నారు. ఇదే క్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగిలయ్యకు గతంలో సీఎం కేసిఆర్ ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొగిలయ్య కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.