భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీల నిర్మించాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల పర్యటన నిమిత్తం భద్రాచలం చేరుకున్న సీఎం కేసిఆర్ ..ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించారు. బాధితులకు పునరావాస కేందంలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి అధికారులతో సమీక్ష జరిపారు. పునరావాస కేంద్రాలను మరి కొన్ని రోజులు కొనసాగించాలని ఆదేశించారు. అందరు అధికారులు సమనవ్యంతో పని చేసి వరద సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
భద్రాచలం కరకట్టను మరింత పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10వేల వంతున ఇస్తామని తెలిపారు. మరో రెండు నెలలు ఇబ్బంది పడకుండా 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. పినపాక, భద్రాచలం ప్రాంత వాసులకు వెయ్యి కోట్లతో రెండు మూడు వేల ఇళ్లతో శాశ్వత కాలనీలను నిర్మిస్తామని కేసిఆర్ తెలిపారు. బూర్గంపాడు వద్ద కూడ కరకట్ట ఏ విధంగా నిర్మించాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులను అదేశించారు కేసిఆర్. ఎంత వరద వచ్చినా ఆలయం వద్దకు నీరు రాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు అధికారులను సీఎం కేసిఆర్ అభినందించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, సీఎం సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.