KCR: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) TRS అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) KCR వరుసగా తొమ్మిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కేసిఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్ ప్లీనరీ TRS Plenary లో కేసిఆర్ విజయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు (Kesava Rao) అధికారికంగా వెల్లడించారు. టీఆర్ఎస్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ మాదాపూ లోని హైటెక్స్ లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలుత పార్టీ అధ్యక్షుడుగా కేసిఆర్ ఎన్నికను ప్రకటించారు. మరో సారి పార్టీ బాధ్యతలు చేపట్టిన కేసిఆర్ పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. ముందుగా హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీలో కేసిఆర్ పార్టీ జండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంలో సిఎం కేసిఆర్ కు హోమ్ మంత్రి మహబమూద్ ఆలీ దట్టి కట్టారు.
ప్రత్యేక తెలంగాణ సాధకుడుగా కేసిఆర్
దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండ దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పార్టీ అధినేత కేసిఆర్ .. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్రలో నిలిచారు. ఏప్రిల్ 27వ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టి ఆర్ఎస్ పార్టీ .. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
KCR: తెల్లచొక్కాలు ధరించి వచ్చిన నేతలకు కేటిఆర్ షాక్..
నేడు జరుగుతున్న టీ ఆర్ఎస్ ప్లీనరీకి గులాబీ చొక్కాలు ధరించి రావాలని పార్టీ అధిష్టానం ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంత మంది ఈ నిబంధనను అతిక్రమించి తెల్లచొక్కాలు వేసుకుని హైటెక్ ప్రాంగణానికి వచ్చారు. ఇది గమనించిన టీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ (KTR) .. గులాబీ చొక్కా ధరించకుండా వచ్చిన నేతల వద్దకు వెళ్లి..గులాబీ షర్ట్ వేసుకోకుండా వచ్చిన వారికి సభా వేదికపైకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న నేతలు అప్పటికప్పుడు గులాబీ రంగు చొక్కాలు తెప్పించుకుని ధరించారు. ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి కేటిఆర్ వద్దకు వెళ్లిన పలువురు పార్టీ నేతలు ఆయనతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఒకొక్కరి ఫోన్ లో స్వయంగా కేటిఆర్ సెల్ఫీ లు తీయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.