CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో గురువారం అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, షూటింగ్ లో సత్తా చాటిన ఈషా సింగ్ లతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యలను ఘనంగా సత్కరించి నగదు బహుమతి చెక్కులను అందజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నిఖత్, ఈషాలకు ప్రకటించిన విధంగా రెండు కోట్ల ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. అదే విధంగా మొగులయ్యకు గతంలో ప్రకటించిన కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేశారు. క్రీడల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సాధించడానికి తమకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహకం అందించడంతో పాటు వెన్నుదన్నుగా నిలిచారని నిఖత్ జరీన్ పేర్కొన్నారు.
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిన్ననే వీరి ప్రోత్సాహాకాలకు సంబందించి ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఈ నగదు ప్రోత్సాహకాలతో పాటు నివాస స్థలం మంజూరు చేస్తున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.