CM KCR Warangal Tour: తెలంగాణలో కరోనా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసిన అనంతరం నిన్నటి నుండి సీఎం కేసిఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండవ రోజు సోమవారం తన పర్యటనలో భాగంగా కేసిఆర్ కొద్దిసేపటి క్రితం వరంగల్లు చేరుకున్నారు. హెలికాఫ్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం కేసిఆర్ కు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసిఆర్ ఏకశిలా పార్క్ లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సెంట్రల్ జైలు స్థలంలో ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థపాన, భూమి పూజ నిర్వహించారు. తదుపరి కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పరిపాలనా భవనాన్ని, అర్బన్ జిల్లా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ భవనం తదితర పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వరంగల్లు పర్యటన ముగిసిన తరువాత సీఎం కేసిఆర్ తిరుగు ప్రయాణంలో సాయంత్రం ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర్శింహస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. శివాలయం, రథశాల, విష్ణు పుష్కరిణి పనులు పరిశీలిస్తారు. ఆలయ పనులు పరిశీలన, అధికారులతో సమీక్ష అనంతరం రోడ్డు మార్గంలో కేసిఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకుంటారు.
Live: CM Sri KCR laying foundation stone for Multi Super Speciality Hospital in Warangal https://t.co/HKqhBfPlny
— Telangana CMO (@TelanganaCMO) June 21, 2021