Corona Effect: కరోనాతో అస్వస్థతకు గురైన సీనియర్ కాంగ్రేస్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (ఎంఎస్ఆర్) ఆరోగ్య పరిస్థితి విషమించింది. గత కొద్ది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎస్ఆర్ కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఎంఎస్ఆర్ చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, గత కొంత కాలం ఆరోగ్యం బాగోలేక కోమాలో ఉన్నారని తెలియజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన కరీంనగర్ స్థానం నుండి మూడు సార్లు ఎంపిగా గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎంఎస్ఆర్ తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇందిరా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరు ఉంది. ఏ విషయాన్ని అయినా స్పష్టంగా నిర్ణోహమాటంగా మాట్లాడే ఎంఎస్ఆర్…కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడుగా, వైఎస్ఆర్ హయాంలో ఏపిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు.