క్యూబా విప్లవ వీరుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనుమరాలు ఎస్తేఫానియా గువేరా ఇవేళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి కమ్యూనిస్టు పార్టీల యువజన సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు హిమాయత్ నగర్ లోని సీపీఐ కార్యాలయాన్ని వీరు సందర్శించారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మీడియాతో మాట్లాడారు. క్యూబాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబాలో ప్రజలు పేద వాళ్లుగా బ్రతికి ధనికుల్లా చనిపోతారని అన్నారు. తమ దేశంలో మహిళా ఫెడరేషన్ ఉంటుందని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఉంటుందని తెలిపారు. క్యూబాలో ఆడ, మగ అనే లింగ వివక్షత ఉండదని అన్నారు.
నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్ సీ ఎస్ సీ), ఐప్సో (ఏఐపీ ఎస్ వో) ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ రోజు సాయంత్రం జరుగుతున్న కార్యక్రమానికి అతిధులుగా అలైదా గువేరా, ఆమె కుమార్తె ఎస్తేఫానియా గువేరా హజరవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకే వీరు హైదరాబాద్ విచ్చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?