Currency Notes Destroyed: మహబూబాబాద్ లోని ఇందిరా కాలనీలో ఓ కూరగాయల వ్యాపారం చేసే వృద్ధుడు తన ఆపరేషన్ నిమిత్తం దాచుకున్న రూ.2.50 లక్షల రూపాయలను ఎలుకలు కొట్టేయడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఎలుకలు కొట్టిన నోట్లు చూసి ఆ వ్యక్తి బావురుమన్నాడు.
Read More: Puligundu: అధ్బుతమైన పర్యాటక ప్రదేశం పులిగుండు..! ఇది ఎక్కడ ఉంది..? ఆ విషయాలు ఏమిటంటే..?
విషయంలోకి వెళితే ఇందిరా కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన కడుపులో కణితి ఆపరేషన్ కోసం రూ.2లక్షలు అప్పు చేశాడు. ఆ డబ్బులతో పాటు కూరగాయలు విక్రయించగా వచ్చిన రూ.50వేలు తన పూరింట్లోని చెక్క బీరువాలో దాచాడు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో భూక్యా రెడ్యా డబ్బులు చూసుకోవడానికి బీరువా తెరిచి చూడగా ఒక్క సారిగా షాక్ గురైయ్యాడు. డబ్బులు అన్నీ ముక్కలు, ముక్కలుగా చినిగిపోయి కనిపించాయి. రూ.500, రూ.100 నోట్లను ఎలుకలు కొరికి పాడు చేశాయి. రెండున్నర లక్షల నోట్లు ఎందుకూ పనికి రాకుండా పోవడంతో ఆ వృద్ధుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనకు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నాడు.
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటిఆర్ స్పందించారు. సదరు నోట్లు మొత్తం పరిశీలన చేయాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లి నోట్లను పరిశీలించి మొత్తం నమోదు చేస్తున్నారు. మంత్రి కేటిఆర్ సారు ఆ వృద్ధుడికి న్యాయం చేస్తారేమో వేచి చూడాలి.
Read More: Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!