Gold Smuggling: విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా గోల్డ్ స్మగ్లింగ్ యదేశ్చగానే కొనసాగుతోంది. దేశంలోని విమానాశ్రయాల్లో రోజు ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం భారీ గా బంగారం పట్టుబడింది.
కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో షార్జా, దుబాయ్ దేశాల నుండి వచ్చిన 15 మంది ప్రయాణీకుల నుండి సుమారు 3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు కోటి 50లక్షల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు 15 మందిని అరెస్టు చేసారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.