Earth Quake: నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవేళ భుప్రకంనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. ఇవేళ ఉదయం ఒక్క సారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల లో నుండి బయటకు పరుగులు తీశారు. వేకువ జామున ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి నుండి శబ్దాలు రావడంతో భయాందోళనలకు గురైయ్యారు. ఒక్క సారిగా ప్రజలు బయటకు పరులుగు పెట్టారు. అయితే భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు నమోదు అవుతుండటంపై భూకంపాలు ఎందుకు నమోదు అవుతున్నాయనే దానిపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది నవంబర్ 16న ఏపిలోని చిత్తూరు జిల్లా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జిరావారిపల్లి తదితర ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. డిసెంబర్ 6న జహీరాంబాద్ మండలం బిలాపూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అంతకు ముందు నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
అసొం బీజేపీ సర్కార్ తీరుపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ .. ఎందుకంటే..?