Eatela Rajendar: ఉత్కంఠకు తెరదించుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ గూటిని వదిలి భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. నేడే ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్కు చెందిన రైతుల భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీజేపీని ఎంచుకున్నారు. అయితే, చివరి నిమిషంలో రాజీనామాలో ట్విస్టు నెలకొంది.
Read More: Eatela Rajendar: ఈటల రాజేందర్… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజన్….
వరుస సమావేశాలతో..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్ విషయంలో క్లారిటీ కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిని కలిశారు. దీంతో పాటుగా పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్తో కూడా ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పర్యటించి రాజీనామా చేసి ఢిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని ఈటల రాజేందర్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి నేడు విలేకరులతో ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు.
Read More: KCR: కరోనా విషయంలో కేసీఆర్ కన్నెర్ర చేస్తే…ఇలా ఉంటుంది
చివరి నిమిషంలో ట్విస్ట్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటుగా మొత్తం అయిదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి , మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సహా మరో ఇద్దరు నేతలు బీజేపీ కండువా కప్పుకొంటారని సమాచారం. ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరే ముందే హైదరాబాద్లోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?